Sunday, April 28, 2024

Komuravelli: నేడు కోర‌మీసాల స్వామిక్షేత్రంలో ప‌ట్నం వారం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ పట్నంవారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

గదులు దొరక్క కొందరు భక్తులు వచ్చిన వాహనాల్లోనే సేదతీరుతున్నారు. కొందరు ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. తిరిగి సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement