Monday, May 6, 2024

Patancheru – డివైడ‌ర్ ను ఢీకొన్న స్కూటీ…ఇద్ద‌రు విద్యార్ధులు దుర్మ‌ర‌ణం ..

న్యూ ఇయర్ వేళ సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు విద్యార్దులు మ‌ర‌ణించారు.. అతివేగంగా దూసుకెళ్లిన స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతులను పాలకుర్తికి చెందిన ఆర్ భరత్ చందర్ (19), జనగామకు చెందిన పి నితిన్ (18)గా గుర్తించారు. ప్రమాదం లో గాయపడిన ఖమ్మంకు చెందిన‌ ఎ. వంశీ (19 ) ని చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు.. ఈ ముగ్గురు సుల్తాన్ పూర్ జెఎన్ టియులో చ‌దువుతున్నారు..

కూకట్ పల్లిలో బైక్ ను ఢీకొన్న స్కోడా …. ఒకరి మృతి..

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఓ స్కోడా కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. మిత్రహిల్స్ నుండి హైదర్ నగర్ వైపు వెళ్తుండగా బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. మృతుడిని మోతి నగర్ కి ప్రయివేట్ ఉద్యోగి చెందిన అరుణ్(33)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement