Wednesday, May 1, 2024

NZB: విద్యుత్ షాక్ తో పాస్ పోర్టు సేవా కేంద్రం దగ్ధం

కామారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 24 ప్రభ న్యూస్ : కామారెడ్డి పట్టణంలోని హైస్కూల్ సమీపంలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో గల పాస్ పోర్టు సేవా కేంద్రంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పాస్ పోర్టు సేవా కేంద్రంకు సంబంధించిన కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ కు మంటలు అంటుకొని పూర్తిగా ఖాళీ బుడిదయ్యాయి.

సేవా కేంద్రం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement