Sunday, April 28, 2024

TS : బోల్తాప‌డ్డ వాహనం … విద్యార్థినీల‌కు త‌ప్పిన ప్ర‌మాదం…

జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో విద్యార్థినీల‌కు త్రుటిలో ప్ర‌మాదం త‌ప్పింది. మండ‌ల‌కేంద్ర‌మైన చిట్యాల‌లో శ‌నివార ఉద‌యం 12మంది ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినీలు ప‌రీక్ష రాసేందుకు వాహనంలో బ‌య‌లు దేరారు. ప‌రీక్ష కేంద్రం వ‌ద్ద‌కు రాగానే ఆ వాహ‌నం బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో విద్యార్థినీలు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో పది పరీక్షలు రాసేందుకు 12 మంది కస్తూర్బా గాంధీ చిట్యాల విద్యార్థినీలు వాహనంలో వెళ్లారు. పరీక్ష కేంద్రం వద్ద వాహనం ఆగి దిగే క్రమంలో బోల్తాపడడంతో విద్యార్థినీలకు చిన్న గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వారికి వైద్య సేవలు అందించారు. అనంతరం వారు పరీక్ష రాసేందుకు కేంద్రంలోకి వెళ్లి పోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement