Wednesday, May 1, 2024

WGL: పేద ప్రజల అభ్యున్నతే మా ద్యేయం.. నన్నపునేని నరేందర్

పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధే తన మొదటి ఏజెండాగా తాను పని చేస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 24వ డివిజన్ లో రూ.2కోట్ల 86 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కార్యక్రమాలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నేడు 24వ డివిజన్ లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. కుడా నిధుల నుండి మరో 2కోట్ల పై చిలుకు నిధులు కేటాయించడం జరిగిందని, సుమారు 5కోట్లతో 24వ డివిజన్ లోని అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వాడ వాడలా సీసీ రోడ్లు, డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరుచుకుంటున్నామని, పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి శిరీష్, డివిజన్ అధ్యక్షులు పందికొండ శివరాజ్, ఆర్టీఏ మెంబర్ గోరంట్ల మనోహర్, దాచపెళ్లి సీతారాం, మైనారిటీ నాయకులు సద్దాం, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement