Wednesday, May 1, 2024

ప్రాణం తీసిన జ‌ల్సా…..

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో జల్సాల కోసం మిర్జాగూడ పరిధిలోకి వచ్చి నలుగురిలో ఒక యువకుడి ప్రాణం కోల్పోయిన సంఘటన మండల పరిధిలోని మిర్జాగూడ లో జరిగింది, స్థానికులు మరియు మోకిల పోలీసులు అందించిన సమాచారం క్రింది విధంగా ఉన్నాయి హైదరాబాద్ నగరంలోని పురాణపూల్ పరిధిలో నివాసముండే నలుగురు యువకులు మిర్జాగూడ సమీపంలో చెరువుకు ఆనుకుని ఉన్న బావి వద్దకు వెళ్లి నలుగురు మిత్రులు కలిసి తాము వెంబడి తెచ్చుకున్న మద్యం ను సేవించి మద్యం మత్తులో బావిలో ఈత కొడదామని దిగారు, వెళ్లిన వారిలో కృష్ణ కుమారు శుక్ల బావిలో ఈత కొట్టే క్రమంలో మునిగిపోయాడు ..మునిగిపోయి ఉండడాన్ని గమనించిన మిగతా ముగ్గురు నీటిలో డిప్ కొడుతున్నాడే మో అని అనుకున్నారు,

మునిగిన అతను ఎంతకు బయటికి రాకపోవడంతో ముగ్గురు యువకులు వారి మిత్రులు మొదలు గండిపేట పోలీస్ స్టేషన్ కు ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చివరకు మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగిన సంఘటనను వివరించారు, మొకిల పోలీసులు గజ ఈతగాళ్ల ను పిలిపించి మృతిచెందిన యువకుడిని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement