Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

చిట్యాల (ప్రభ న్యూస్): ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్ పేట, నైన్ పాక గ్రామాల మధ్య చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం..

నైన్ పాక గ్రామానికి చెం దిన పెండ్యాల బన్నీ, పెండ్యాల శ్రీధర్, సన్నీ లు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై జడల్ పేట కు వస్తుండగా మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన పెండేల బన్నీ( 15 ) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సన్నీ శ్రీధర్ లను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి ఆస్పత్రికి తరలిం చారు.. సంఘ టనా స్థలానికి ఎస్సై వీరభ ద్రరావు తన సిబ్బం దితో చేరుకుని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement