Monday, April 22, 2024

Breaking: ఫార్మాసిటీలో ప్ర‌మాదం.. విషవాయువు లీకై ఇద్దరు యువకులు మృతి

తుని : విశాఖ జిల్లాలో మరోసారి విషవాయువు లీకై ఇద్దరు యువకులు చ‌నిపోయారు. వీరిలో ఒకరు తూర్పు గోదావరి జిల్లా, తుని మండలం, వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన అన్నం రెడ్డి దుర్గాప్రసాద్ (21 ) కాగా, మరొకరు విశాఖ జిల్లా, పాయకరావుపేట గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మణికంఠ ( 22 ) సోమవారం పరవాడ జె.ఎన్ ఫార్మాసిటీలో వీరు విధి నిర్వహణలో ఉండగా విషవాయువు లీకై ఇరువురు యువకులు చ‌నిపోయారు.

దుర్గాప్రసాద్, మణికంఠ జె.ఎన్ ఫార్మాసిటీలో పంప్ హౌస్ వాల్వ్ ఓపెన్ చేస్తుండగా విషవాయువు లీక్ కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. దుర్గాప్రసాద్, మణికంఠలు ఇరువురు మంచి స్నేహితులు ఉపాధి కోసమని పది రోజుల కిందట ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగంలో చేరారు. వీరిరువురు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ కలిసి చదివారు. వెలమ కొత్తూరు, పాయకరావుపేట గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement