Monday, May 6, 2024

NZB: 22న ప్రతి ఇంట్లో రామ జ్యోతులు వెలిగించాలి.. ఎంపీ ధ‌ర్మ‌పురి

నిజామాబాద్ సిటీ, జనవరి 18 (ప్రభ న్యూస్) : అయోధ్య రామ మందిర పున ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న ప్రతి ఇంట్లో రామ జ్యోతులు వెలిగించి హిందూ ధర్మ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా అయోధ్య పండుగను వైభవంగా జరుపు కోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. అయోధ్యలో జరిగే భవ్యమైన రామమందిరం పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయాల శుద్దీకరణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇందూర్ పట్టణంలో దశాబ్దాల చరిత గల ఖిల్లా రామాలయాన్ని శుద్ధి చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణలు హాజరై ఖిల్లా ఆలయాన్ని అందరితో కలిసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నరసయ్య, నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, పోతంకర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ప్రవళిక, స్థానిక కార్పొరేటర్ ఇల్లేందుల మమత -ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ వీర్ శేఖర్ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement