Thursday, May 2, 2024

TS: ఈనెల 16న కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి వెట్‌ రన్‌.. ప్రారంభం

ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన తెలిసిందే. ఈ క్రమంలో వెట్‌ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌ రన్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించనున్నారు. వెట్‌రన్‌లో భాగంగా రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వెట్‌రన్‌ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఈనెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు.


దక్షిణ తెలంగాణకు పండుగ రోజు : సీఎం కేసీఆర్‌
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణకు పండుగ రోజులాంటిదని, సీఎం కేసీఆర్ ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజినీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement