Thursday, May 2, 2024

MBNR: ఆర్టీసీ బస్సులో హార్ట్ అటాక్ తో వృద్ధురాలు మృతి

రాజాపూర్: రాజాపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై వనపర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వృద్దురాలు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. రాజాపూర్ స్టేజి దగ్గర వృద్ధురాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. అకస్మాత్తుగా హార్ట్ అటాక్ గురై మృతిచెందింది.

ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం… వృద్ధురాలు బాదేపల్లి దగ్గర వనపర్తి డిపోకు చెందిన బస్సులో ఎక్కి హైదరాబాద్ పోవడానికి టికెట్ తీసుకున్నదని, మార్గమధ్యలో రాజాపూర్ స్టేజ్ దగ్గర బస్సు సీట్లో కూర్చొని అకస్మాత్తుగా వామ్టింగ్ చేసుకుని, బస్సులోనే అక్కడికక్కడే హార్ట్ అటాక్ తో మృతి చెందిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement