Sunday, May 19, 2024

TS | గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు.

విద్యార్థులు డిసెంబరు 18 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు అని అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించనున్నట్‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement