Sunday, April 28, 2024

Seethakka: తాను ఏ పదవిలో ఉన్నా… ప్రజా సేవకురాలినే..

కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడుతూ… తాను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడున్నా ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలినేనని పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తెలంగాణ ప్రజలు తనపై మరింత పెద్ద బాధ్యతను పెట్టారని చెప్పారు.

తెలంగాణలో నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు. 2004 నుంచి 2011 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ విధానాలను ఇప్పుడు కూడా అమలు చేస్తామని వివరించారు.

సంక్షేమ పాలన అందించడంలో అన్నివర్గాల మద్దతు తమకు కావాలని, అందరూ తమకు సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని సీతక్క చెప్పారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో జనం పేదరికంలో మగ్గుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను డెవలప్ చేసి గొప్పగా చూపించుకోవడం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement