Saturday, May 4, 2024

TS : తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట.. జ‌ల‌మ‌యంగా కాల‌నీ..

నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే.. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు.

- Advertisement -

నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు కాలనీ వాసులు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement