Thursday, May 2, 2024

NZB: అత్తింటి వేధింపులకు వివాహిత బలి…

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లాలో అత్తింటి వేధింపులకు వివాహిత బలైన ఘటన కలకలం రేపింది. నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ గుట్టలో నవిత (31) అనే వివాహిత సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి పట్టణంలోని చిన్న కసాబ్ గల్లి లో నివాసముంటున్న బాలరాజ్- రాధా గౌడ్ దంపతులకు చెందిన వారి కుమార్తె నవితను నగరానికి చెందిన వరుణ్ గౌడ్ తో 2015లో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.25 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు.

నవిత ఓ ప్రైవేట్ ల్యాబ్ లో టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుంది. వరుణ్ గౌడ్-నవిత దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. సాఫీగా జరుగుతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ సోమవారం రాత్రి నవిత ఆత్మహత్యకు పాల్పడం కలకలం రేపింది. ఈ సందర్భంగా నవిత తల్లిదండ్రులు మాట్లాడుతూ… అత్తింటి వేధింపులకి తమ కూతురు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వాపోయారు. పోలీసులు ఆత్మహత్యపై పూర్తి విచారణ చేసి అత్తింటి వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. నవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నాలుగో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మిన్నంటిన బంధువుల రోదనలు..

- Advertisement -

ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన నవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ఆసుపత్రి వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి.. అత్తింటి వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిగేంతవరకు తమపోరాటం ఆగదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement