Sunday, May 5, 2024

NZB: రెండు గ్రామాలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్

నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : రూరల్ మండలంలోని గుండారం, తిర్మన్ పల్లి గ్రామాలను ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి బుదవారం సందర్శించారు. గుండారంలో గ్రామ పంచాయతీ భవనం రికార్డులు, నర్సరీ మొక్కలు, పల్లె ప్రగతి పనులు, కంపోస్ట్ షెడ్డును పరిశీలించారు. గ్రామ హుమెన్ కమిటీ సభ్యులు, మహిళా గ్రూప్ సభ్యులతో చర్చలు జరిపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిర్మన్ పల్లిలో రైతు వేదిక భవనం పంచాయతీలో జరిగిన పనులు మహిళా గ్రూప్ సభ్యులతో మాట్లాడారు. ఎంపీవో మధురిమ, గ్రామ ప్రత్యేక అధికారులు, సెక్రెటరీలు ఆమెకు పూల బోకేతో ఆహ్వానం పలికారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement