Friday, May 3, 2024

తల్లిని కొట్టి చంపిన కసాయి కొడుకు

నిజామాబాద్ రూరల్ : తాగుడికి బానిసైన వ్యక్తి భార్యను వేధింపులతో పుట్టింటికి పంపాడు. ఆమె వెళ్లిన తర్వాత కన్న తల్లినే కాటికి పంపిన కసాయి కొడుకు ఉదంతం రూరల్ మండలంలోని తిర్మన్ పెల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గంగేశ్వర్ తన తల్లి అంజమ్మతో రోజు తాగడానికి డబ్బులు కావాలని వేధించేవాడు. అతని భార్యతో మాట్లాడి సంసారానికి తీసుకురా అంటూ తల్లితో గొడవ పడే వాడు. సోమవారం రాత్రి గాంగేశ్వర్ ఇంటికి వెల్లి తల్లి ఆంజమ్మతో గొడవ పడి రొట్టెల కోలతో తల్లి అంజమ్మ చెవి భాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో బలమైన గాయమై అంజమ్మ (56) చనిపోయిందని రూరల్ ఎస్ఐ లింబాధ్రీ తెలిపారు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ నరేష్ సందర్శించి, పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్డం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నా మన్నా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement