Thursday, May 2, 2024

Nzb: గౌతమ్ నగర్ లో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ సిటీ, జులై 8 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో గౌతమ్ నగర్ లో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి గౌతమ్ నగర్ లో ఓ వ్యక్తిపై కొందరు కత్తితో దాడికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ నగర్ కు చెందిన అజీముద్దీన్ కు, ఆటోనగర్ కు చెందిన సనా బేగంతో మూడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది.. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో, అజిముద్దిన్ చెల్లెలు సమ్రిన్ కూతురును, సంవత్సరం క్రితం అజిముద్దీన్ సనా బేగంలు దత్తత తీసుకున్నారు.

శుక్రవారం రాత్రి సనా బేగం, ఆమె సోదరులు, బంధువులు దత్త పుత్రిక విషయమై మాట్లాడుకుందామని గౌతమ్ నగర్ కు నయీమ్, అవేజ్, షదాబ్ లు వచ్చారు. మాటమాట పెరగడంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. వెంటనే స్థానికులు గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement