Friday, May 17, 2024

Encounter – మోడీ, రాహుల్ కి కెసిఆర్ ని తిట్టుడే ప‌ని – హారీష్ రావు..

హైద‌రాబాద్ – ప్ర‌ధాని మోడీకి, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి కెసిఆర్ ని తిట్ట‌డం త‌ప్ప మ‌రోప‌ని లేద‌ని మంత్రి హారీష్ రావు మండిప‌డ్డారు.. తెలంగాణ‌కు ద్రోహం చేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు కెసిఆర్ సార‌ధ్యంలో సాధించిన ప్ర‌గ‌తిని చూసి ఓర్వలేక అడ్డ‌మైన ఆరోప‌ణ‌లు, ఆబ‌ద్దాలు చెబుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు..

వ‌రంగ‌ల్ బిజెపి సంక‌ల్ప స‌భ‌లో మోడీ బిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన మంత్రి ఎవరూ రాష్ట్రానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని అన్నారు. మొన్న రాహుల్ వచ్చిన, ఈ రోజు ప్రధాని మోదీ వచ్చినా వాళ్లకు తిట్టుడే పని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. తాము మంచిగా పని చేయకపోతే ఢిల్లీలో అవార్డులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీలో తిడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మోడీనే అంటున్నారని.. మరి పెట్టుబడులు వస్తున్నాయంటే కేసీఆర్ గొప్పతనం కాదా? అని ప్రశ్నించారు.


తెలంగాణకు మోడీ ఏం చేశారో చెప్పాలని అన్నారు. రూ.20వేల కోట్ల రూపాయిలు కోచ్ ఫ్యాక్ట‌రీని గుజ‌రాత్ కు త‌ర‌లించుకుపోయిన మోడీ త‌మ‌కు మాత్రం కేవలం 500 కోట్ల వ్యాగ‌న్ ఫ్యాక్ట‌రీని ఇస్తూ గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.. కోచ్ ఫ్యాక్ట‌రీ వ‌స్తే 40వేల ఉద్యోగాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వ‌చ్చేవ‌ని,ఈ వ్యాగ‌న్ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల అన్ని ఉద్యోగాలు వ‌స్తాయా అంటూ మోడీని నిల‌దీశారు.. ల‌డ్డూలు మీ గుజ‌రాత్ కు, పిప్ప‌ర మెంట్ లు మాకునా అంటూ ప్ర‌శ్నించారు..

ఈడీ, సీబీఐలు మోదీకి అండగా ఉండొచ్చని.. తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని అన్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చినట్టుగా మోడీ చెబుతున్నారని.. అయితే అందులో నిజం లేదని రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ఆపారని ఆరోపించారు. కేంద్రానికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నిజంగా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని కోరారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు.

బావుల కాడా మీటర్లు పెట్టాలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో మంటలు లేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని.. బురద జల్లుడు తప్ప బీజేపీ చేసేందేమి లేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement