Saturday, May 4, 2024

TS: సభాపతి ఇంట రక్షాబంధన్ సందడి

బాన్సువాడ : పేగుబంధం పేరేన్నిక గల బంధం, పెనవేసుకుపోయే రక్త బంధం, పెరిగి పెద్దగైనా చెరగని అనుబంధం. పేర్లు వేరైనా తల్లి గర్భం ఒక్కటే వీటి సంహారమే అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధం. తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహం బాన్సువాడలో రక్షాబంధన్ సందడి మొదలైంది. అక్కా తమ్ముడు, అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను చెప్పుకోవచ్చు. సభాపతి పోచారం అక్క దొడ్ల సత్యవతి పోచారానికి రాఖీ కట్టి అక్క తమ్ముడు అనుబంధానికి ప్రతీకగా నిలిచారు.

80 ఏళ్ల వయసు దాటిన వారి అనుబంధం నేటికీ ప్రేమ అనురాగాలతో కొనసాగుతూనే ఉంది. రాఖీ కట్టిన అక్కకు పోచారం పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత పోచారం శ్రీనివాస్ రెడ్డి పదేపదే ప్రజలకు వివరిస్తూ ఉంటారు. అదేవిధంగా తాను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అక్క చెల్లెళ్ల అనుబంధం విడదీయరానిది అంటూ అక్క ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ పోచారం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement