Wednesday, May 1, 2024

NZB: ప్రజా సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయం.. అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 31(ప్రభ న్యూస్):
దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టి.. ప్రజల అభ్యున్న తికి కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్‌ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 9 వ డివిజన్ లో బీజేపీ ఖిల్లా మండల శాఖ ఎస్టీ మోర్చా అధ్యక్షులు సుందర్ రాథోడ్ నివాసం లో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం తో వాళ్ళతో కలిసి భారత్ ప్రధాన మంత్రి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. పేదల సమస్యలు బడుగుల ఆశయలను వెలికి తీయడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్,కోడూరు నాగరాజ్, సాయినాథ్,కిరణ్, మఠం పవన్, డివిజన్ నాయకులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement