Sunday, April 28, 2024

NZB: భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే సత్తా కేవలం మోడీ దే… ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, ఫిబ్రవరి (ప్రభ న్యూస్) : భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే సత్తా కేవలం మోడీ కే ఉందని, మోడీకి, బీజేపీకి ఓటు వేస్తె దేశానికి, మన ధర్మానికి ఓటు వేసినట్లే అని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. మాత రాజ్యలక్ష్మి మందజీ దేశం కోసం మోడీ ధర్మం కోసం బీజేపీ, ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే సంకల్పంతో ఈనెల 12వ తేదీన తమిళనాడు మధురై నుండి బుల్లెట్ బండి పై యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర పూర్తిగా 65 రోజులు,15 రాష్ట్రాలు, 21,000 కిలోమీటర్లు, 18 ఏప్రిల్ ఢిల్లీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్బంగా ఇందూర్ నగరానికి చేరుకున్న మాతాజీ కి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం వారికీ మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ… దేశమంతా, పార్టీలకు అతి తంగా అందరూ మోడీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మరో సారి మోడీ సర్కార్ కోసం మాత రాజ్యలక్ష్మి మందజీ తలపెట్టిన బుల్లెట్ యాత్ర విజయవంతంగా సాగాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, సుప్రీం కోర్టు న్యాయవాదులు గురుజీ ఆనంద్ బట్టికిరి, హరీష్ రెడ్డి, భాస్కర్, కిరణ్, రోషన్ లాల్ భోర, అల్లాడి రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement