Sunday, April 28, 2024

NZB: ఒకే రోజు… బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్..

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకేరోజు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇరుపార్టీల అభ్యర్థుల నామినేషన్లతో ఇందూరులో సందడిగా మారింది.


రైతులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన ఎంపి ధర్మపురి అరవింద్..
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్లకు చెందిన పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేసారు.. నామినేషన్ రుసుంను పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఇటీవల తన ఇంటివద్దే సుమారు 40 క్వింటాళ్ల పసుపును క్వింటాలుకు రూ.19,500 లకు అమ్ముకున్న రైతు వెల్మ రమేష్ అర్వింద్ ధర్మపురి నామినేషన్ ను ప్రపోజ్ చేశారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజీరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు..
నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకి రాజ్యసభ సభ్యులు కెఆర్.సురేష్ రెడ్డి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యా ల ఎమ్మెల్యే సంజయ్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బోధన్ మాజీ శాసన సభ్యులు శకిల్ ఆమీర్ సతీమణి అయోష సుల్తానా, జగిత్యాల జడ్పీ చైర్మన్ వసంతతో నామినేషన్ దాఖలు వేశారు..

- Advertisement -

మహాలక్మి ఆలయంలో బాజిరెడ్డి ప్రత్యేక పూజలు…
నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ సందర్భంగా ఉదయం తన నివాసం నుండి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్ళారు. అంతకుముందు మహాలక్మీ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు గొడుగు మల్లేష్ ముదిరాజ్, శ్రీకాంత్ మల్లెపూల చారీ, వినోద్ గంట, రంగారావు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement