Thursday, May 2, 2024

కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ కాపీలు అందజేసిన మంత్రి వేముల

కుల సంఘాల భవనాలకు, మండపాల హెల్త్ సబ్ సెంటర్, కళ్యాణ పలు నిర్మాణాలకు 1కోటి 50లక్షల విలువ గల ప్రొసీడింగ్స్ కాపీలను రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులకు మంత్రి నిధులు మంజూరు చేశారు. వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.


ముప్కాల్ మండలం:
కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి గుడి కళ్యాణ మండపం, వేంపల్లి మున్నూరు కాపు సంఘం కుస్టపూర్ సంఘం వాడ, వేంపల్లి మున్నూరు కాపుజక్క సంఘం వాడ, వేంపల్లి మున్నూరు కాపు తెళ్ల సంఘం వాడ, వేంపల్లి నాయకపోడ్ సంఘం, వేంపల్లి మున్నూరు కాపు నార్ల సంఘం, నల్లూరు గంగపుత్ర సంఘం, ముప్కాల్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు సంఘం అదనపు గదుల నిర్మాణం, నాగంపేట్ గురడి రెడ్డి సంఘం, నాగంపేట్ గురడి రెడ్డి సంఘం అదనపు గదుల నిర్మాణం.


ఏర్గట్ల మండలం..
మండల కేంద్రంలో నేరెళ్ళ గురడి సంఘం, జక్కని ముదిరాజ్ సంఘం, జుంగుల ముదిరాజ్ సంఘం, తడ్పాకల్ గ్రామంలో మాదిగ సంఘం, మున్నూరు కాపు సంఘం, కుమ్మరి సంఘం, తొర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వెనుకాల డ్రైన్ నిర్మాణం కోసం.

- Advertisement -

భీంగల్ మండలం..
మున్సిపల్ కేంద్రంలో గ్రంధాలయం వద్ద కల్వర్టు నిర్మాణం, బోయి గల్లి బెస్త సంఘం కమ్యూనిటీ హాల్, పల్లికొండ గ్రామంలో సి.సి రోడ్డు.

వేల్పూర్ మండలం..
వేల్పూర్ మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం కోసం రూ.20 లక్షల ప్రొసీడింగ్, పచ్చలనడుకుడ గ్రామానికి చింతలూరు చెక్ డ్యాం నుండి పెద్దచెరువు వరకు గల ఫీడర్ ఛానల్ రిపేర్ కోసం రూ.36 లక్షలు వ్యయం, జీవన జ్యోతి మహిళ సంఘం అదనపు గది నిర్మాణం, సాహెబ్ పేట్ గ్రామంలో మత్స్య సహకార సంఘం భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement