Tuesday, April 30, 2024

Minister : కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు మంత్రి వేముల భరోసా

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన ఓ బాధిత కుటుంబానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచారు. బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన తనుశ్రీ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నది.

ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా.. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం 2లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేశారు. ఎల్ఓసి కాపీని బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. నిరుపేదలమైన తమకు కిడ్నీ చికిత్స కోసం రూ.2లక్షల ఎల్ఓసిని మంత్రి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement