Friday, April 26, 2024

Kamareddy : అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భర్త మృతి

కామారెడ్డి కలెక్టరేట్ శివారులో రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. నర్సాగౌడ్ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. డీఎస్పి సురేష్, సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై ప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement