Sunday, May 5, 2024

NZB: ప్రజా సేవకుడిగా పనిచేస్తా.. ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 4 (ప్రభ న్యూస్): నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అర్బన్ ప్రజలకు 24గంటలూ అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించిన ఇందూర్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నరసయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. అధికార పార్టీ, కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఇందూర్ గడ్డ బీజేపీ అడ్డా అని ప్రజలు నిరూపించారన్నారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభి వృద్దికి కృషి చేస్తానన్నారు.

రోడ్లు, డ్రైనేజీ, ఆసుపత్రులు.. నగరంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. కేంద్రంలో మూడో సారి మోడీ ప్రభుత్వం వస్తదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నాయకులను ఒప్పించి.. అధిక నిధులను తీసుకువచ్చి అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు. అర్బన్ లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజల చిరాకాల వాంక్ష అయిన సొంతింటి కలను నెరవేరుస్తానన్నారు. ఇల్లు లేని నిరుపేద మహిళలకు ఇల్లు ఇస్తానన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి… యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్మేళా కార్యక్రమాన్ని చేపడుతానని చెప్పారు. ఈ విజయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నుంచి కిందిస్థాయి కార్యకర్తల, ప్రతి నాయకుడి విజయమని అందరి కృషితో గెలుపు సాధ్య మైందన్నారు. తన విజయానికి సహకరించిన అర్బన్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలాం రాజు, ఎర్రం సుధీర్, రోషన్, మధు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement