Monday, May 6, 2024

పేద కుటుంబాలకు సర్కారు ఆసరా : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

బిక్కనూర్ : పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి బస్వాపూర్ గ్రామాలలో కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మందికి పింఛన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. పేదరికంతో ఎవరు బాధపడవద్దన్నా ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, సర్పంచులు వేణు పోతిరెడ్డి మంజుల మల్లారెడ్డి, మండల తెరాస అధ్యక్షులు నరసింహారెడ్డి, తాసిల్దార్ నరసింహులు, మండల అభివృద్ధి అధికారి అనంతరావు, మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement