Friday, May 3, 2024

NZB: పెంటాఖుర్ధులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

బోధన్ మండలం పెంటాఖుర్ధు గ్రామంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిపిత మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ వీరన్న పటేల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు పరిచి ప్రజలకు సుపరిపాలన అందించి దేశ చరిత్రలో ఆదర్శంగా నిలిచిందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement