Wednesday, May 15, 2024

ఇందల్ వాయిలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరూ మృతి

ఇందల్ వాయి, ప్రభ న్యూస్ : ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని డికొనడం తో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. మరోక్కరు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దింతో అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతులు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గంబిరావు పెట్ మండలానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. మహమ్మద్ అత్తర్ అలీ(48). మొహమ్మద్ హైమద్ (46).అనే ఇద్దరు ముస్లిం సోదరులు కామారెడ్డికి చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందినవారు పనుల కోసం నిజామాబాదుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ కు గురి అయ్యారని స్థానికులు తెలిపారు.

- Advertisement -

క్షేత గత్రుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. ఒకరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లో తుది శ్వాస విడిచారు. పోలీసులు మాత్రం ఇంక ఎలాంటి ధృవీకరణ చేయలేదు మృతదేహాలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి వివరాలు వెల్లడిస్తామని ఎస్ ఐ మహేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement