Saturday, May 4, 2024

NZB: ప్రభుత్వ ఆస్పత్రి పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పై నుంచి వృద్ధురాలు దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలం జనగాయిపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ (65) అనే వృద్దురాలు అనారోగ్యానికి గురికావడంతో గత నాలుగు రోజుల క్రితం చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండవ అంతస్తులో అడ్మిట్ అయ్యింది.

ఇవాళ ఉదయం రత్నమ్మ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో మృతి చెందింది. ఈ మేరకు1వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement