Sunday, April 28, 2024

NZB: ఆలయ అభివృద్ధికి కృషి.. నుడా చైర్మన్

నిజమాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్) 2: ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నుడా కార్యాలయంలో నుడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డిని వినాయక్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ సద్గురు దామం ధార్మిక సేవా సంస్థ ట్రస్ట్ దత్తాశ్రమం ఆలయ కమిటీ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.

ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పకాయల హరిదాస్, అధ్యక్షులు ముల్కి రాములు, ఉపాధ్యక్షులు దేషుముఖ్ గణపతి, సంయుక్త కార్యదర్శులు శంకర్ గౌడ్, గంగ ప్రసాద్ గుప్తా, కమిటీ సభ్యులు భాస్కర్, దయానందు పాల్గొన్నారు. చైర్మన్ చిన్న నాటి స్నేహితులు జిల్లా కేంద్రానికి చెందిన దామోదర్, గోపాల్, కృష్ణ నుడా కార్యాలయంలో చైర్మన్ శాలువాతో సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement