Sunday, April 28, 2024

TS | కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా ధన్ పాల్ .. పార్టీ నిర్ణయం

నిజామాబాద్ సిటీ, జనవరి 8 (ప్రభ న్యూస్): నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కు కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి గా బాధ్యతలు అప్పగించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి గా బాధ్య తలు అప్పగించారు.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్బంగా ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీ ఇచ్చిన బాధ్యతను తప్పకుండా పనిచేసి కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తానన్నారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ రాబోతుందన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని మీడియా ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement