Wednesday, May 1, 2024

గడ్డ మీది తాండాలో గిరిజన యువతి మరణం..

సిరికొండ, ప్రభన్యూస్ : నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్టేషన్ పరిధిలోని గడ్డ మీది తాండకు చెందిన గుగులోత్ రుక్కు (32) అనే మహిళ మరణించినట్లు ధర్పల్లి సిఐ శ్రీశైలం తెలిపారు. సిఐ అందించిన వివరాల ప్రకారం. బుధవారం రాత్రి తన పిల్లలతో (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) కలసి ఉన్న ఆవిడ‌.. మరునాడు పొలం ద‌గ్గ‌ర‌ చెట్టుకు ఉరి వేసుకున్న శవమై లభించిందని అయన చెప్పారు. కొండూర్ గ్రామ పరిధిలోని పిసరగుట్ట తాండకు చెందిన మృతురాలు బంధువులు భర్త మహిపాల్ చంపి చెట్టుకు వేలాడదీసినట్లు భావించి అతని ఇల్లుకు నిప్పంటించినట్లు సి.ఐ వివరించారు. మృతురాలి బంధువులకు ఎటువంటి అనుమానలున్న పోలీసులను సంప్రదించాలని. చట్టాన్ని చేతులోకి తీసుకోవడం సరైంది కాదని అన్నారు.

మృతురాలి బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నాము. పంచనామ రిపోర్ట్ అందిన తర్వాత మృతురాలు ఎలా చనిపోయింది తెలుస్తుందని అన్నారు. మృతురాలుది హ‌త్య.. ఆత్మహత్య అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నాం.. క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని సి.ఐ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement