Friday, May 3, 2024

NZB: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరగాలి… జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్

బిక్కనూర్, జులై 28 (ప్రభా న్యూస్) : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగే విధంగా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు ఎన్ని కాన్పులు జరుగుతున్నాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ… ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ కాన్పులు జరిగే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో ప్రజలకు వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హేమీమా, వైద్య సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement