Sunday, April 28, 2024

NZB | వ‌ర‌ద బాధితుల‌కు బీజేపీ సాయం.. నిత్యావసర స‌రుకులు అంద‌జేత‌

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిరుపేదలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని 38వ, 22వ, 34వ డివిజన్ లో వర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా 38వ డివిజన్ లోని భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయాయి. బాధితుల ద‌గ్గ‌రికి వెళ్లి 15 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, తక్షణ ఆర్థిక సాయంగా కొంత డబ్బులు అందచేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement