Sunday, April 28, 2024

TS: చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్‌లు బైక్‌పై వివాహానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ అన్నారం కలాన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై కిషన్, సవాయి సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement