Sunday, April 28, 2024

వ‌ర‌ద‌ల‌తో ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయిన కుటుంబాల‌కు ప్ర‌భుత్వం బాస‌ట‌.. ఆర్థిక సాయం అంద‌జేసిన బాజిరెడ్డి

నిజామాబాద్ : భారీ వర్షాల కారణంగా ప్రమాదవశాత్తు చ‌నిపోయిన వారి కుటుంబాలకు ప్ర‌భుత్వం బాస‌ట‌గా నిలిచింది. ఇవ్వాల వారి కుటుంబాల‌కు ఆర్టీసీ చైర్మ‌న్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఆర్థిక సాయం అందించారు. నిజామాబాద్ క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. నిజామాబాద్ రూర‌ల్ ప‌రిధిలోని ముత్తకుంటలోని లింగి తండా వాసులైన‌ మక్కల నడిపి సాయిలు (45), దారాంగుల రెడ్డి (35) చ‌నిపోయారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు వారి కుటుంబాల‌కు బాజిరెడ్డి ఆర్థిక సాయం అంద‌జేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement