Monday, April 29, 2024

ఐక్యతతోనే ఏదైనా సాధ్యం : ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 9 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగర ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలని ఐక్యతతో ఏదైనా సాధ్యమని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో అడహక్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి మల్లేష్. కోశాధికారి సిద్ధంశెట్టి విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ బ్రాహ్మన్లపల్లి బాల్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్య వైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీ నారాయణ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి జై వాసవి.. జై జై వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల స్వాగతం నృత్యం అలరించింది. అనంతరం ముఖ్య అతిథులు నూతన కార్యవర్గం తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షులుగా కొండ వీరశేఖర్ గుప్తా, మాణిక్ భవన్ సంఘం నూతన అధ్యక్షులుగా ధన్పాల్ శ్రీనివాస్, యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ఇల్లందు ల ప్రభాకర్ గుప్తా వైశ్య భవన్ నూతన కమిటీ అధ్యక్షులుగా చందూరు ధర్మేంద్ర గుప్తా, కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పెండ్యాల శ్రీనివాస్ (వాసు) గుప్తా, గ్రాడ్యుయేట్ సంఘం (ఆవో గా) అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య మండలి నూతన అధ్యక్షురాలిగా దొంతుల ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారులుగా, కార్యవర్గ సభ్యులుగా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement