Monday, April 29, 2024

Nzb: మద్యం మత్తుతో కర్రతో వీరంగం.. 12మంది విద్యార్థులకు గాయాలు

నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో వడ్డేపల్లి పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులపై మోహన్ అనే వ్యక్తి కర్రతో దాడి చేశాడు. 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను వైద్య నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులు పాఠశాలల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి పాఠశాల సమీపంలో పాఠశాలల్లో ఆటలు ఆడుకునే సందర్భంలో మోహన్ అనే వ్యక్తి నేను కూడా మీతో ఆటల్లో పాల్గొంటానని విద్యార్థులతో దుర్భాషలాడాడు. మోహన్ ఉదయాన్నే మద్యం సేవించి విద్యార్థులతో వివాదాన్ని సృష్టించి చేతిలో ఉన్న కర్రతో 12 మందిని గాయపరిచాడు.

జరిగిన సంఘటన గురించి వర్ని మండల గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సింగిల్ విండో అధ్యక్షులు నామాల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వీర్రాజు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement