Monday, May 20, 2024

Nizamabad – రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు..

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)5: ప్రజలు నిర్భయంగా ఎటు వంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియో గించుకోవాలనీ ప్రజలకు భరోసా కల్పించడానికే నిజా మాబాద్ అర్బన్ లో నిర్వహిం చిన కవాతు ముఖ్య ఉద్దేశమని అడిషనల్ డీసీపీ, ఏసీపీ కిరణ్ కుమార్ లు అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో పెట్టుకుని ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమి షనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఆదేశాలతో అడిషన ల్ డీసీపీలు జయరాం, గిరిరా జ్, ఏసిపి నిజామాబాద్ కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో మూ డో పట్టణ పోలీస్, రూరల్ పోలీ స్ స్టేషన్ పరిధిలో పట్టణ సిఐ నరహరి, సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ, నార్త్ సిఐ సతీష్ కుమార్ లు మూడవ పోలీస్ స్టేషన్ ,రూరల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వ ర్యంలో కవాతు నిర్వహించా రు.

స్వేచ్ఛ , నిష్పక్షపాత ఎన్ని కల కోసం మీతో ఉన్నా మని ప్రజలలో నమ్మకం కలిగించడా నికే ఈ కవాతు అన్నారు.ఈ కవాతులో మూడో పట్టణ ఎస్సై ప్రవీణ్, ఐదో పట్టణ ఎస్సై అప్పారావు, మాక్లూర్ ఎస్సై సుధీర్ రావు, రూరల్ ఎస్సై మహేష్ లు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement