Sunday, April 28, 2024

Nirmal – గురుకుల పాఠ‌శాల‌ల్లో కలుషిత ఆహారాలా…హ‌రీష్ రావు ఆగ్ర‌హం

వ‌రుస సంఘ‌ట‌న‌ల‌పై హ‌రీష్ రావు ఆగ్ర‌హం
కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు
క‌నీసం విద్యార్ధుల‌కు మంచి ఆహ్వారం కూడా ఇవ్వ‌లేరా
మ‌రోసారి ఇటివంటి ఘ‌ట‌న‌లు లేకుండా చూడండి..

హైద‌రాబాద్ : నిర్మ‌ల్ జిల్లా న‌ర్సాపూర్ మండ‌లం కేంద్రంలోని కేజీబీవీ పాఠ‌శాల‌లో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి రావ‌డం దారుణమ‌న్నారు.

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరార‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement