Thursday, May 2, 2024

TS CM: ఐఏఎస్ అధికారుల‌ న్యూ ఇయర్‌ వేడుకల్లో.. సీఎం రేవంత్‌ దంపతులు

నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ వైభవంగా నిర్వహించారు. పాత ఏడాదికి గుడ్‌ బై చెప్పి, కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. సాధారణ ప్రజలు మొదలు అధికారులు, రాజకీయ నాయకుల వరకు కొత్త ఏడాది వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించారు. బేగంపేటలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

- Advertisement -

వేడుకకు హాజరైన అధికారులను సీఎం పేరుపేరునా పలకరించారు. అందరితో నవ్వుతూ పలికారు. సీఎం దంపతులను సంఘం అధ్యక్షుడు శశాంక్‌ గోయల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమ కుటుంబ సభ్యులతో సీఎం దంపతులను కలిశారు.

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్‌ జయప్రకాశ్‌ నారాయణ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వేడుకకు ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, ఆమ్రపాలి, విజయేంద్ర, కుర్రా లక్ష్మీ, శ్రీదేవసేన, శృతి ఓజా, సీఎస్‌ శాంతికుమారితో పాటు తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement