Friday, May 3, 2024

నియోనేటల్ 108 అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించిన నియోనేటల్ అంబులెన్స్ను ను నేడు రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువులను ఏదైనా సమస్య వస్తే జిల్లా ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని గాంధీ లేదా ఉస్మానియా మరియు నీలోఫర్ ఆసుపత్రికి తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు

పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నియో నేటల్ అంబులెన్స్ కేటాయించిందని దానిలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు నియో నేటల్ అంబులెన్స్ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం పరిచారు ఎవరికైనా ఆపద సమయంలో నియోనేటల్ అంబులెన్స్ ను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి భాస్కర్ నాయక్ , 108 జిల్లా ఇన్చార్జి రవి పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement