Friday, May 17, 2024

RIP – అనారోగ్యంతో మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు పి. నర్సారెడ్డి మృతి

నిర్మల్ ప్రతినిధి జనవరి 29 ప్రభా న్యూస్ )సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామానికి చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కురవృద్ధుడు పి. నర్సారెడ్డి (93) సోమవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు.

1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.నర్సారెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా.1989 అదిలాబాద్ లోక్సభకు తొమ్మిదవ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక విజయం సాధించారు. నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement