Sunday, April 28, 2024

Narsampet – బ్యాంక్ లో ఇంటి దొంగ – ₹ 9 కోట్లు స్వాహా

నర్సంపేట, ,(ప్రభ న్యూస్) వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేసే ఓ వ్యక్తి కన్నం వేసిన సంఘటన చోటుచేసుకుంది. వ్యక్తి చేసిన పని వల్ల కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని బ్యాంకు కే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.సదరు బ్యాంకులో బంగారం తదితర అంశాలు చూసుకునే సదరు వ్యక్తి బంగారం పై లోన్ పెట్టుకుని తిరిగి తీసుకున్న వారి పేరున తిరిగి బంగారం పెట్టినట్లు నకిలీ ఎన్విలప్ పెట్టీ నగదు తస్కరించినట్లు తెలుస్తోంది.

.విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా విచారణ జరుపుతున్నట్లు,పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.సుమారు 9కోట్ల మేర నష్టం జరగవచ్చని అంచనా.బ్యాంకులో పనిచేసే వ్యక్తి ఈ పని చేయడం వల్ల బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని బ్యాంకుకే పెద్ద ఎత్తున నష్టమని కస్టమర్లు ఎటువంటి ఆందోళన పడవద్దని అంత అవసరం కూడా లేదని పోలీసులు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement