Saturday, May 4, 2024

Update : నాంప‌ల్లి ఘ‌ట‌న‌లో.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య‌

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో సోమవారం మంటలు ఎగసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్లో చిక్కుకుని తొమ్మిదిమంది సజీవ‌ దహనమయ్యారు.. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చారు..


కాగా ఈ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. దీంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement