Tuesday, May 7, 2024

కేసీఆర్ పాలనలో.. అభివృద్ధి పథంలో పల్లెలు : ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో వాడవాడలా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ నిధులు రూ.50 లక్షలతో పూర్తయిన సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.25లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement