Friday, May 10, 2024

NLG: తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ సతీమణి ఇంటింటి ప్రచారం..

మోత్కూర్, నవంబర్ 14 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే డా.గాధరి కిశోర్ కుమార్ సతీమణి కమల తుంగతుర్తి నియోజకవర్గంలో తొలి రోజు మోత్కూర్ లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి మెయిన్ రోడ్ వెంట మహిళా ఓటర్లకు సంప్రదాయ బద్దంగా కుంకుమ బొట్టు పెట్టి తన భర్త కిశోర్ కుమార్ ని ముచ్చటగా మూడోసారి(హ్యాట్రిక్) ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని 9 మండలాల్లో రోజుకో మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు, కిశోర్ గెలుపులో తాను సైతం భాగస్వామి కానున్నట్లు తెలిపారు.

- Advertisement -

హోటల్ లో పూరీలు వేస్తూ… ఎమ్మెల్యే కిశోర్ సతీమణి కమల వినూత్న ప్రచారం..
తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే డా.గాధరి కిషోర్ కుమార్ గెలుపు కోరుతూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఓ హోటల్ లో పూరీలు వేస్తూ కిశోర్ సతీమణి కమల మహిళా నాయకురాలుతో కలిసి వినూత్న ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో గత 2సార్లు కిశోర్ ని ఎమ్మెల్యేగా ఆదరించిన ప్రజలు ఈ దఫా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేగారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మీనరసింహ రెడ్డి, రైతు బంధు జిల్లా సభ్యురాలు ధబ్బేటి శైలజ, కట్ట ఇంద్రజ్యోతి, రేగోటి ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement