Sunday, May 5, 2024

రాజ‌గోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక : మంత్రి మ‌ల్లారెడ్డి

మునుగోడులో కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో నిర్వహించిన ప్రచారంలో ఇంటింటికి తిరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి ఓటేయాలని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. దుబ్బాక‌, హుజూరాబాద్ లో గెలుపొందిన బీజేపీ నేత‌లు చేసిందేమీ లేద‌న్నారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డి ఒక 420 అని చెప్పారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. నాంపల్లి మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను వివరించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌కే పట్టంకట్టాలన్నారు. కూసుకుంట్లను మరోసారి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఇక పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నారాయణపురం మండలంలోని గిరిజన తండాల్లో విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement